అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు వాహనాలు నిలిపివేస్తారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం వాహనాలు ఆపొద్దని ఆదేశించారు. ఈ మేరకు గురువారం సాధారణ ట్రాఫిక్లో పర్యటించారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఢిల్లీ వెళ్తున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad Airport) మార్గంలో తన కాన్వాయ్ కోసం వాహనాలను ఆపడాన్ని ఆయన గమనించారు. ఇక నుంచి ట్రాఫిక్ను ఆపొద్దని డీజీపీని ఆదేశించారు. గురువారం సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్లో ప్రయాణించారు. సీఎం ఆదేశాలతో ఇవాళ కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా ఒక మార్గంలో పోలీసులు అనుమతించారు.
Revanth Reddy Convoy | గతంలో సైతం..
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో సైతం ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు. తన కాన్వాయ్ కోసం వాహనాలు నిలిపేయొద్దని సూచించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులు దీనిని అమలు చేసిన పోలీసులు తర్వాత.. మరిచిపోయారు. దీంతో సీఎం కాన్వాయ్ కోసం వాహనాలను నిలివేస్తుండటంతో ప్రజలు ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలే నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో సీఎం, ఇతర మంత్రుల కాన్వాయ్ల కోసం వాహనాలు ఆపుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాజాగా సీఎం ట్రాఫిక్ను ఆపొద్దని ఆదేశించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నారు.
Revanth Reddy Convoy Moves Through Regular Traffic
Chief Minister Revanth Reddy’s convoy travelled in regular traffic from Shamshabad airport to his residence, following clear instructions against stopping vehicles across the city for convoy movement.
Traffic police allowed… pic.twitter.com/7pYbXAEJIe
— Hyderabad Mail (@Hyderabad_Mail) May 7, 2026
ఇది కూడా చదవండి..: ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

