అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో మూడు వారాల్లో 432 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ సందర్భంగా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారికి రూ.40 లక్షలకు పైగా కోర్టులు జరిమానాలు విధించాయని వెల్లడించారు.
Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్ (bodhan), ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో మూడు వారాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ (Drunk Driving) తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో 432 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్(Armoor) కోర్టులలో ప్రవేశపెట్టగా.. 25 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష పడిందని చెప్పారు. మిగతా వారి వద్ద నుంచి రూ.40,25,000 జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు.
Drunk Driving Cases | మద్యం తాగి వాహనాలు నడపవద్దు..
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఎల్లప్పుడూ వెంటనే ఉంచుకోవాలని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్సు ఆరు నెలల పాటు సస్పెండ్ చేయనున్నట్లు హెచ్చరించారు. మైనర్లు తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే మైనర్తో పాటు వాహనం ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామని జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Eatala Rajender comments | రాజకీయాల్లో తోసుకుంటూ పోవాల్సింటే : ఎంపీ ఈటల

