అక్షరటుడే, వెబ్డెస్క్: IPL Betting Suicide | ఐపీఎల్ బెట్టింగ్ భూతానికి మరొకరు బలి అయ్యారు. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని లక్నోకు చెందిన 35 ఏళ్ల వ్యాపారి బెట్టింగ్లో నష్టపోవడంతో 11వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సీతాపూర్కు చెందిన ప్రబల్ జైన్, గుడంబా పోలీస్ స్టేషన్ (Gudamba Police Station) పరిధిలోని ‘జనేశ్వర్ అపార్ట్మెంట్’లో అద్దెకు నివసించేవాడు. 8 నెలల క్రితమే అతనికి ప్రేమ వివాహం జరిగింది. అతను ఐపీఎల్ (IPL) మ్యాచ్లపై బెట్టింగ్ వేసేవాడు. గురువారం ఆర్సీబీ, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో అతను లక్షల రూపాయలు కోల్పోయాడు. అనంతరం తన భార్యకు ఫోన్ చేశాడు. తాను సర్వం కోల్పోయానని ఏడుస్తూ చెప్పాడు. ఆమె ఓదార్చడానికి యత్నించినా.. అతడు మ్యాచ్ జరుగుతుండగానే అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు.
IPL Betting Suicide | సూసైడ్ నోట్
ఆ యువకుడు కింద పడిన శబ్దం విని, ఆ సొసైటీకి చెందిన ప్రజలు అక్కడికి పరుగున వెళ్లారు. అప్పటికే ప్రబల్ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి సూసైడ్ నోట్ (Suicide Note) లభించింది. అందులో ప్రబల్ మ్యాచ్లో డబ్బు కోల్పోయిన విషయం గురించి రాశాడు. ఈ ఘటనపై ఘజియాబాద్ ACP అనింద్య విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించిందని తెలిపారు. ఆ మ్యాచ్లో తాను డబ్బు కోల్పోయినట్లు అందులో పేర్కొన్నాడు. అతను తన భార్యకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడన్నారు.
ఇది కూడా చదవండి..: Cooking Oil Price Rise | భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

