అక్షరటుడే, గాంధారి: Farmers Protest | ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. గాంధారి మండల (Gandhari Mandal) కేంద్రంలో బాన్సువాడ (Banswada) గాంధారి రహదారిపై వారు సోమవారం మహాధర్నా నిర్వహించారు.
Farmers Protest | అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యమేనా..
ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) సభ్యులు మాట్లాడుతూ ఇదివరకే తహశీల్దార్, మార్క్ఫెడ్ అధికారులకు, కలెక్టర్కు వినతి పత్రాలు అందించామని.. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు. దీంతో గతిలేని స్థితిలో రోడ్డుపై ధర్నా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం ధర రూ.2,400 నిర్ణయిస్తే.. దళారులు రూ.1,700 నుంచి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. అంతేకాకుండా జొన్నకు ప్రభుత్వం రూ.3,700 ఉండగా దళారులు రూ.2,600 కొనుగోలు చేస్తున్నారని వాపోయారు.

ఇది కూడా చదవండి..: KCR Jagtial Meeting | నేడు జగిత్యాలకు గులాబీ బాస్.. ఏడాది తర్వాత కేసీఆర్ సభ

