అక్షరటుడే, లింగంపేట: Grain Transport Obstruction | కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామ శివారులో సోమవారం ధాన్యం రవాణాకు ఆటంకం కలిగించిన ఘటనలో 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
Grain Transport Obstruction | కందకం తవ్వి…
పోలీసుల వివరాలు ప్రకారం.. మాలపాటి గ్రామానికి చెందిన రైతు కంపె రాజయ్య తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తీసుకురాగా.. తూకం పూర్తయిన తర్వాత లారీలు రాకుండా కొందరు రహదారికి అడ్డంగా జేసీబీతో కందకం తవ్వారు.
బాధిత రైతు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బాలరాజు, అరవింద్, చాకలి బాబు, సంపత్, రాజు, రాంబాబు, రవి, శివయ్య, హరికృష్ణ, రామచందర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
Mamata Banerjee setback | భవానీపూర్లో మమత వెనుకంజ.. నందిగ్రామ్లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

