అక్షరటుడే, వెబ్డెస్క్: GST Officer Bribery | దేశంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే అత్యన్నత స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ, సీబీఐ, విజిలెన్స్ బృందాలు సోదాలు, అరెస్టులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా ఓ అధికారి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ.. కెమెరాకు చిక్కాడు.
బెంగళూరు (Bangalore)లోకాయుక్త చేపట్టిన ఒక ఆపరేషన్లో సెంట్రల్ జీఎస్టీ (GST) సూపరింటెండెంట్ రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు. నిందితుడిని సౌత్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ డివిజన్-4కు చెందిన జీఎస్టీ సూపరింటెండెంట్ మోహిత్ ప్రతాప్ సింగ్గా గుర్తించారు. పెండింగ్లో ఉన్న జీఎస్టీ బకాయిలుపై తప్పుడు ఫిర్యాదును మూసి వేయడానికి ఓ వ్యాపారిని సదరు అధికారి లంచం అడిగాడు.
GST Officer Bribery | వల పన్ని..
సదరు వ్యాపారి సయ్యద్ జమీర్ దీనిపై లోకాయుక్తాను ఆశ్రయించాడు. లోకాయుక్త అధికారులు ఒక వల పన్ని, మధ్యవర్తి ద్వారా డబ్బు తీసుకుంటుండగా మోహిత్ ప్రతాప్ సింగ్ను పట్టుకున్నారు. ఈ లావాదేవీలో సల్మాన్ షేక్ అనే వ్యక్తి దళారీగా వ్యవహరించాడు. అతడిపై కూడా కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Delhi Police | ఢిల్లీలో దారుణం.. బాలికపై గ్యాంగ్రేప్