అక్షరటుడే, వెబ్డెస్క్ : Gundla Singaram Eviction | హన్మకొండ జిల్లా (Hanmakonda District) గుండ్లసింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో వేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించారు.
గుండ్ల సింగారం ప్రాంతంలో కొన్నేళ్లుగా పేదలు నివాసం ఉంటున్నారు. అయితే శనివారం తెల్లవారుమున అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడకు చేరుకున్నారు. జేసీబీల సాయంతో గుడిసెలు, షెడ్లను కూల్చవేశారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి స్థానికులు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Gundla Singaram Eviction | 200 మంది పోలీసులతో..
హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సుమారు 200 మంది పోలీసుల బందోబస్తుతో గుండ్ల సింగారం చేరుకున్నారు. అనంతరం గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ ఆదేశామ మేరకు గుడిసెలు తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఉన్నాయని బాధితులు తెలిపారు. ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
హన్మకొండలో పేదల గుడిసెలు కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
గుండ్ల సింగారంలోని సర్వే నంబర్ 174లో పేద ప్రజలు నివసిస్తున్న దాదాపు 200 గుడిసెలు కూల్చివేత pic.twitter.com/o2SKSJweec
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2026
ఇది కూడా చదవండి..: Kavitha Allegations | లంచం అడుగుతున్న డిప్యూటీ సీఎం.. కవిత సంచలన ఆరోపణలు