Guruvayur Temple Weddings | ఆలయంలో ఒకేసారి 372 జంటల వివాహం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Guruvayur Temple Weddings | మలయాళ మాసమైన ‘చింగం’లో రెండో ఆదివారం సందర్బంగా కేరళం (Keralam)లోని గురువాయూర్ ఆలయంలో 372 జంటలు వివాహం నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం నూతన జంటలతో కళకళలాడింది.

ఆలయంలో ఉదయం 4 గంటలకే ప్రారంభమైన ఈ వివాహ కార్యక్రమాలు సుమారు 11:30 గంటలకల్లా పూర్తయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివాహ తంతు, ఆలయ దర్శనం జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకలకు, కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసేందుకు ఆలయ సిబ్బందితో పాటు అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు.

Guruvayur Temple Weddings | 6 మండపాల్లో..

వివాహాలు ఉదయం 4 గంటల నుండే ప్రారంభమయ్యాయి. ‘తాలికెట్టు’ (మంగళసూత్రధారణ) కోసం 6 వివాహ మండపాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ‘కోయ్మ’లను (ఆలయ సిబ్బందిని) వివాహ మండపాలకు కేటాయించారు. ఆలయ తూర్పు మార్గాన్ని పూర్తిగా ‘వన్-వే’గా మార్చారు. భక్తులు ఒకే దిశలో వెళ్లేలా చూడటం ద్వారా రద్దీని నియంత్రిస్తున్నారు. వధూవరులతో పాటు ఫొటోగ్రాఫర్లతో సహా కేవలం 24 మందిని మాత్రమే మండపం దగ్గరకు అనుమతించారు.

 

దీనిని కూడా చదవండి : KPSC Exam Irregularities | పరీక్షల్లో అక్రమాలు.. ఐఏఎస్​ అధికారి అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *