అక్షరటుడే, ఇందూరు: Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని (Nizamabad) మిర్చి కంపౌండ్లో గల తన ఇంటిపై జెండాను ఎగురవేశారు.
Har Ghar Tiranga | వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు.
ఇది కూడా చదవండి: Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ