అక్షరటుడే, కోటగిరి : Hindu Atmiya Sammelan | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని సాయిబాబా కల్యాణ మండపంలో బుధవారం సాయంత్రం విరాట్ హిందు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా యజ్ఞం ట్రస్ట్ వ్యవస్థాపకులు విశోక తీర్థస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ఆర్ఎస్ఎస్ (RSS) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందూ బంధువులందరూ బస్టాండ్ నుంచి సాయిబాబా కల్యాణ మండపం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు.
Hindu Atmiya Sammelan | సంప్రదాయాలు పాటించాలి
విశోక తీర్థస్వామి మాట్లాడుతూ… పిల్లలకు ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాల నేర్పించాలని సూచించారు. హిందు దేవతల గురించి చెప్పాలన్నారు. అప్పుడే భగవంతునిపై భక్తి పెరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన ధర్మం హిందూ ధర్మం అన్నారు. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రచారక్, తెలంగాణ ప్రాంతం సహా భౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్, మంగళ శ్రీకరి యశస్వి తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Fishing Net Tragedy | చేపల వలలో చిక్కుకొని యువకుడి మృతి
