అక్షరటుడే, కామారెడ్డి: RTI Act | మున్సిపల్ కార్యాలయంలో (Kamareddy Municipality) సమాచార హక్కు చట్టం(Information Rights Act) అమలుపై నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బల్దియాకు కొత్త కమిషనర్గా పర్వతాలు బాధ్యతలు తీసుకుని పదమూడు రోజులు దాటినా స.హ చట్టం బోర్డుపై ఇంకా పాత కమిషనర్ పేరే దర్శనమిస్తోంది.
RTI Act | అధికారుల నిర్లక్ష్యం
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోనే అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. కమిషనర్ మారి 13 రోజులు గడుస్తున్నా సమాచార హక్కు చట్టం – 2005 బోర్డుపై మాత్రం ఇంకా పాత కమిషనరే మొదటి అప్పిలేట్ అధికారిగా ఉన్నట్లు ముద్రించి ఉంది. ఈనెల 4న కొత్త కమిషనర్గా పర్వతాలు బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ సీహెచ్. రాజేందర్ రెడ్డి బదిలీ అయి నెల రోజులు దాటిపోయింది. అయినా అధికారుల కళ్లు తెరుచుకోవడం లేదు.
అందరికీ సమాచారం అందించే బోర్డునే అప్డేట్ చేయలేని దుస్థితిలో మున్సిపల్ యంత్రాంగం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుర్చీలో కూర్చున్న కమిషనర్ ఎవరో కూడా తెలియని అధికారులు ప్రజా ఫిర్యాదులను ఏం పరిష్కరిస్తారని స్థానికులు నిలదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gig Workers Strike | నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె


