RTI Act | కామారెడ్డి బల్దియాలో స.హ.చట్టం అమలుపై నిర్లక్ష్యం..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: RTI Act | మున్సిపల్ కార్యాలయంలో (Kamareddy Municipality) సమాచార హక్కు చట్టం(Information Rights Act) అమలుపై నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బల్దియాకు కొత్త కమిషనర్​గా పర్వతాలు బాధ్యతలు తీసుకుని పదమూడు రోజులు దాటినా స.హ చట్టం బోర్డుపై ఇంకా పాత కమిషనర్​ పేరే దర్శనమిస్తోంది.

RTI Act | అధికారుల నిర్లక్ష్యం

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోనే అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. కమిషనర్ మారి 13 రోజులు గడుస్తున్నా సమాచార హక్కు చట్టం – 2005 బోర్డుపై మాత్రం ఇంకా పాత కమిషనరే మొదటి అప్పిలేట్ అధికారిగా ఉన్నట్లు ముద్రించి ఉంది. ఈనెల 4న కొత్త కమిషనర్‌గా పర్వతాలు బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ సీహెచ్. రాజేందర్ రెడ్డి బదిలీ అయి నెల రోజులు దాటిపోయింది. అయినా అధికారుల కళ్లు తెరుచుకోవడం లేదు.

అందరికీ సమాచారం అందించే బోర్డునే అప్‌డేట్ చేయలేని దుస్థితిలో మున్సిపల్ యంత్రాంగం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుర్చీలో కూర్చున్న కమిషనర్ ఎవరో కూడా తెలియని అధికారులు ప్రజా ఫిర్యాదులను ఏం పరిష్కరిస్తారని స్థానికులు నిలదీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gig Workers Strike | నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *