అక్షరటుడే, వెబ్డెస్క్: Hormuz Strait Tankers | హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లు మందుపాతరలను ఢీకొని పేలిపోయాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం తెలిపింది. అమెరికా గూఢచార సంస్థల తప్పుడు సమాచారం మేరకు హర్ముజ్ జలసంధికి దక్షిణాన వెళ్ళడానికి ప్రయత్నించిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయి, మంటలు చెలరేగాయి అని పేర్కొంది.
హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న నాలుగు నౌకలను తాము నిలువరించామని ఇరాన్ గార్డ్స్ తెలిపింది. అమెరికా సైన్యం మద్దతుతో నాలుగు నౌకలు జలసంధి గుండా వెళ్ళడానికి ప్రయత్నించగా, క్షిపణి, డ్రోన్ల సంయుక్త దాడిలో ఆ నాలుగు నౌకలను అక్కడికక్కడే నిలిపివేశామని ఇరాన్ తెలిపింది. మరోవైపు రెండు నౌకలు పేలిపోయాయని ప్రకటించింది. అయితే ఇరాన్ వాదనను అమెరికా ఖండించింది. ఐఆర్జీసీ చేసే చాలా వాదనల మాదిరిగానే, ఇది కూడా అబద్ధం అని పేర్కొంది.
Hormuz Strait Tankers | కొనసాగుతున్న దాడులు
జలసంధిలో నౌకాయానానికి ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా, అమెరికా ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని తిరిగి విధించింది. టెహ్రాన్ సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో ఇరాన్లోని లక్ష్యాలపై ప్రతిరాత్రి వైమానిక దాడులు కూడా నిర్వహిస్తోంది. శనివారం జరిగిన దాడిలో దక్షిణ ఇరాన్ ప్రావిన్స్ అయిన హోర్మోజ్గాన్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారని ఇరాన్ తెలిపింది.
ఇది కూడా చదవండి..: Mexico Earthquake | మెక్సికోను వణికించిన 11 వరుస భూకంపాలు.. రోడ్డుపైనే ప్రజలు