అక్షరటుడే, వెబ్డెస్క్: Indian Ship Red Sea | యెమెన్ పశ్చిమ తీరంలోని ఎర్ర సముద్రంలో ఒక క్షిపణి దాడికి గురైన భారత జెండా కలిగిన సరుకు రవాణా నౌక బోల్తా పడి మునిగిపోయింది. ఆ నౌకలో 14 మంది సిబ్బంది ఉండగా, వారిలో 13 మంది భారతీయ నావికులు, ఒకరు యెమెన్ దేశస్థుడు. 14 మంది నావికులను యెమెన్ బలగాలు రక్షించాయి.
హౌతీల ఆధీనంలో ఉన్న హోడెయిడా ఓడరేవు నగరానికి దక్షిణంగా సుమారు 13 నాటికల్ మైళ్ల దూరంలో ఎంఎస్వి ఫైజ్ నూరే ఓలియా అనే నౌకపై దాడి జరిగింది. యెమెన్ జలాల సమీపంలో నౌకపై జరిగిన ‘కారణం లేని’ దాడిని భారత్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonowal) మాట్లాడుతూ, భారతీయ నౌకను ఒక క్షిపణి ఢీకొనడంతో అది బోల్తా పడి మునిగిపోయిందని తెలిపారు.
Indian Ship Red Sea | ప్రజల భద్రతే ముఖ్యం
పడవపై జరిగిన ఈ అకారణ దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్నట్లు సర్బానంద తెలిపారు. 14 మంది నావికులను యెమెన్ తీరరక్షక దళం సురక్షితంగా రక్షించి మోఖా ఓడరేవుకు తీసుకువచ్చిందన్నారు. రియాద్లోని రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, సిబ్బంది భద్రత, రక్షణ కోసం యెమెన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత నౌకలపై జరుగుతున్న దాడుల ఘటనలు తీవ్ర ఆందోళనకరమైనవి అని పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం పునరుద్ధరించాలి పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Vehicle to Vehicle | రోడ్లపై మాట్లాడుకునే వాహనాలు..2028 నుంచి V2V వ్యవస్థ తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదన!