అక్షరటుడే, లండన్: Iran Embassy Post | అమెరికా, ఇజ్రాయెల్లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, బ్రిటన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Embassy) చేసిన పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. శత్రువుల ముందు తలవంచే ప్రసక్తే లేదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని యూకేలో ఉంటున్న తమ దేశ పౌరులకు ఎంబసీ పిలుపునిచ్చింది.
Iran Embassy Post | ఎంబసీ పోస్ట్:
దేశాన్ని శత్రువులకు అప్పగించే కంటే బలిదానానికి సిద్ధపడటం మేలని, స్వచ్ఛందంగా ప్రాణాలు అర్పించే వారు తమను సంప్రదించాలని ఎంబసీ తన పోస్ట్లో పేర్కొంది.
Iran Embassy Post | బ్రిటన్ ఆగ్రహం:
ఈ పోస్ట్ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ బ్రిటన్ ప్రభుత్వం (Britan Government) తీవ్రంగా స్పందించింది. బ్రిటన్ గడ్డపై ఉంటూ ఇలాంటి హింసాత్మక ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇరాన్ రాయబారి సయ్యద్ అలీ మౌసావికి సమన్లు జారీ చేసింది. అయితే, తమ పోస్ట్పై ఇరాన్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇది కేవలం దేశభక్తిని చాటే అంశమని, మాతృభూమి పట్ల ఉన్న విధేయతను తెలియజేస్తుందని పేర్కొంది. తాము హింసను ప్రోత్సహించడం లేదని సమర్థించుకుంది.
విషయం: యుద్ధం వస్తే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంబసీ చేసిన తాజా ప్రకటన యూరోపియన్ దేశాల్లో భద్రతా పరమైన ఆందోళనలను పెంచుతోంది.
ఇది కూడా చదవండి..: Trump Iran Strategy | ఇరాన్పై ట్రంప్ వ్యూహం.. ఆర్థిక దిగ్బంధమే లక్ష్యం!


[…] ఇది కూడా చదవండి..: Iran Embassy Post | రెచ్చగొట్టేలా ఇరాన్ పోస్ట్.. ఆ… […]