Jharkhand Student Protest | జార్ఖండ్​లో విద్యార్థుల ఆందోళన.. పత్తా లేని కాంగ్రెస్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jharkhand Student Protest | పేపర్​ లీకేజీకి వ్యతిరేకంగా జార్ఖండ్​లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. అయిన రాష్ట్రంలోని జేఎంఎం, కాంగ్రెస్​ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) స్పందించకపోవడం గమనార్హం.

నిరాహార దీక్ష చేస్తున్న రాహుల్ క్రాంతి గురువారం మీడియాతో మాట్లాడారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా లేదన్నారు. తమ సొంత ఏజెన్సీల ద్వారా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని ప్రభుత్వం చెబుతుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు, సీబీఐ (CBI) విచారణకు ఆదేశించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మొదట్లో, ప్రభుత్వ ప్రతినిధి బృందం నిరసన జరుగుతున్న ప్రదేశానికే రావాలని మేము కోరుకున్నామని చెప్పారు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో, చర్చల కోసం మా ప్రతినిధి బృందాన్నే పంపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ నెల 10న శాసన సభ ముట్టడి నిర్వహిస్తామని తెలిపారు.

Jharkhand Student Protest | ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసన

విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా.. JPSC, JSSC CGL ఇతర వివిధ పోటీ పరీక్షలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై, బీజేపీ ఎమ్మెల్యేలతో కూడిన ప్రతిపక్షం రాష్ట్ర అసెంబ్లీ బయట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఎమ్మెల్యే నిర్మల్ మహతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్​ చేశారు. గవర్నర్, రాష్ట్రపతి పాలన యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. జార్ఖండ్‌లోని వ్యవస్థపై పూర్తిస్థాయిలో అపనమ్మకం నెలకొందని చెప్పారు.

Jharkhand Student Protest | రాహుల్​ గాంధీ ఎక్కడ..

నీట్​ పేపర్​ లీకేజీకి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు రాహుల్​ గాంధీ మద్దతు తెలిపారు. విద్యార్థుల పక్షాన మాట్లాడారు. పార్లమెంట్​ ఆవరణలో నిత్యం నిరసన తెలుపుతున్నారు. అయితే తమ పార్టీ అధికారం పంచుకుంటున్న జార్ఖండ్​లో పేపర్​ లీకేజీపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఆయన కనీసం స్పందించడం లేదు. తమ పార్టీ అధికారంలో ఉండటంతోనే రాహుల్​ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక్కడ అదే సమస్య ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎందుకు కోరడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kejriwal Ethanol Allegation | ఇథనాల్ బ్లెండింగ్ వివాదం.. కేంద్రంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *