Kadapa Murder Case | కడపలో దారుణం.. భార్య లావుగా ఉంద‌న్న‌ కోపంతో యూట్యూబ్‌లో వెతికి మ‌రీ హత్య

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kadapa Murder Case | ప్రొద్దుటూరు (Proddatur)లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన భర్త తన భార్యను ముందుగా పథకం వేసుకుని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించగా, నిందితుడు చేసిన ప్రణాళిక, అమలు విధానం షాక్‌కు గురి చేస్తోంది.

వైఎస్సార్ కడప జిల్లా (Kadapa District)కు చెందిన భద్రిపల్లి కిరణ్‌కుమార్‌కు 8 ఏళ్ల క్రితం పద్మజ (31)తో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. కిరణ్ గత కొన్నేళ్లుగా ఇంటి నుంచే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.అయితే, కొంతకాలంగా భార్య పద్మజ బరువు పెరగడం, ఆహార అలవాట్లు మారడం భర్తకు నచ్చలేదు. ఈ విషయంపై తరచూ వాగ్వాదాలు జరిగేవి. అంతేకాకుండా, భార్య తనపై అనుమానం వ్యక్తం చేస్తోందని భావించి కిరణ్ లో కక్ష పెరిగింది.

Kadapa Murder Case | యూట్యూబ్‌లో సెర్చ్ చేసి హత్యకు ప్లాన్

భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న కిరణ్, గూగుల్ మరియు యూట్యూబ్‌లో విషంతో హత్య చేసే మార్గాలపై సెర్చ్ చేశాడు. ఒక వీడియో ద్వారా వ్య‌క్తిని సంప్ర‌దించి సుమారు రూ.80 వేల ఖర్చుతో విషాన్ని తెప్పించుకున్నాడు.ఏప్రిల్ 29న భార్యను తన స్వగ్రామమైన ప్రొద్దుటూరుకు తీసుకువచ్చి, ఆమెకు ఇష్టమైన పాలకోవాలో విషం కలిపి తినిపించాడు. విషం ప్రభావంతో పద్మజ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత, నిందితుడు దిండుతో ఆమె ముఖాన్ని గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, కొన్ని గంటల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, తరువాత గుండెపోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

Kadapa Murder Case | అసలు విషయం వెలుగులోకి

పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు పూర్తి వివరాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణ ఘటన సమాజంలో పెరుగుతున్న అసహనానికి, కుటుంబ విభేదాలు ఎలా విషాదానికి దారి తీస్తున్నాయో మరోసారి గుర్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి..: AP POLYCET Results| ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. మన్యం జిల్లాలే ‘టాప్’!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *