అక్షరటుడే, వెబ్డెస్క్: Kalvakuntla Kavitha | కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పెసా చట్టానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు.కల్వకుంట్ల కవితతో ఆల్ ఇండియా ఆదివాసీ కాన్సిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకుల భేటీ ఆదివారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్లోని రక్షణలను కేంద్రం తొలగిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)లో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడం లేదన్నారు.
Kalvakuntla Kavitha | 8వ షెడ్యూల్లో చేర్చాలి
కేంద్ర ప్రభుత్వం (Central Government) చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమే అని ఆరోపించారు. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని కవిత డిమాండ్ చేశారు.

Kalvakuntla Kavitha | 25న కొత్త పార్టీ
కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ పెట్టనున్నారు. ఈ మేరకు ఆమె అని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున జాగృతిలో చేరుతున్నారు. జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడు అప్పల నరేందర్ (Appala Narendra) ఆధ్వర్యంలో పలువురు అడ్వకేట్లు ఆదివారం జాగృతిలో చేరారు. కవిత కండువా కప్పి వారిని ఆహ్వానించారు. 25న పార్టీ ఏర్పాటు కోసం కవిత గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఇటీవల కాశీకి వెళ్లి ప్రత్యేక పూజలు సైతం చేసి వచ్చారు. అయితే పార్టీ పేరు ఏం పెడతారనే ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..: Revanth Reddy | గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్రెడ్డి

