అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమావేశం ముగిసింది. ఆరు గంటలకుపైగా నేతలు పలు అంశాలపై చర్చించారు.
కర్ణాటక నాయకత్వంలో మార్పు లేదని. సీఎం మార్పు వార్తలన్నీ ఊహాగానాలే అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ (KC Venugopla) తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవి ఆశిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలతో ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కావడం కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు పక్కా అని వార్తలు వచ్చాయి. అయితే వాటిని కేసీ వేణుగోపాల్ కొట్టిపారేశారు.
Karnataka CM Change | ఆ ఎన్నికలపై చర్చించాం
ఢిల్లీ (Delhi)లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు (Karnataka CM Change) జరగవచ్చనే ఊహాగానాలకు కొత్త ఊపు వచ్చింది. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడికి సంబంధించిన ఎలాంటి చర్చలు జరగలేదని కాంగ్రెస్ పేర్కొంది.

కేసీ వేణుగోపాల్ ఈ ఆరోపణలను గట్టిగా ఖండించారు. రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలపై చర్చించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని రాజ్యసభ సీట్లు, శాసన మండలి ఎన్నికల వ్యూహంతో సహా, చర్చలు పూర్తిగా ఎన్నికల సంబంధిత అంశాలపైనే కేంద్రీకృతమయ్యాయని వెల్లడించారు.
#WATCH | Amid speculations around CM post in Karnataka, after a party meeting, Congress general secretary (organisation) KC Venugopal says, “…The entire discussion was concentrated only on upcoming Rajya Sabha elections and Council Elections of Karnataka. Whatever speculation… pic.twitter.com/d7ZcBY5A2R
— ANI (@ANI) May 26, 2026
దీనిని కూడా చదవండి : Shamirpet Tahsildar Bribe | రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్


