Lakshmikantha Rao | ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఎల్లారెడ్డి : Lakshmikantha Rao | నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పక్కాగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ‘సార్​తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమాన్ని మద్నూర్​ మండల (Madnur Mandal) కేంద్రంలో నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 Lakshmikantha Rao | ప్రజలతో మమేకమై..

ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామస్తులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: BRS National Integration Day | బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *