Madras Regiment | ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. రిటైర్డ్​ ఆర్మీ అధికారి అరెస్ట్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Madras Regiment | సికింద్రాబాద్​ (Secunderabad) పరిధిలోని బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి 12 ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్రాస్​ రెజిమెంట్​లో ఆయుధాలు చోరీ అయిన విషయం గత నెల 30న వెలుగు చూసిన విషయం తెలిసిందే. నిందితులు మూడు నెలలుగా పక్కా ప్లాన్​తో ఆయుధాలను మాయం చేశారు. ఇందులో ఏకే –47 సహా పలు ఆయుధాలు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసిన ఆర్మీ అధికారి ఈ చోరీలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అతడితో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Madras Regiment | ఆయుధాలు స్వాధీనం

చోరీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి రిటైర్డ్ అధికారి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయుధాలు, మ్యాగజైన్లు, తూటాలు, బైనాక్యులర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయుధాగారం పనితీరుపై అవగాహన ఉన్న సిబ్బంది సహాయంతో ఆ రిటైర్డ్​ అధికారిఈ దొంగతనానికి ప్రణాళిక రచించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇది కూడా చదవండి..: Telangana Assembly Day 5 | ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *