అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Allegations | బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి తమ సీసీ కెమెరాలు, ఫోన్లు హ్యాక్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీ లాగా పని చేస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డి జైలులో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ (Manne Krishank)ను సోమవారం ఉదయం కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడిని బయటకు తెచ్చిన మన్నె క్రిశాంక్ గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను బయట పెట్టినందుకు 35 కేసులు పెట్టారని ఆరోపించారు.
KTR Allegations | పాలనపై దృష్టి పెట్టాలి
బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకుల మీద రేవంత్ రెడ్డి (Revanth Reddy) పెట్టిన శ్రద్ధలో ఒక పైసా భాగం అయినా రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలపై పెట్టాలని కేటీఆర్ కోరారు. రేవంత్ రెడ్డి ఇంతకు ఇంతా చెల్లించుకుంటారని, ఇవ్వన్నీ బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. కరీంనగర్లో ఉదయం జ్యువెల్లరి షాప్లో కాల్పులు జరిగాయన్నారు. వీటి గురించి పట్టించుకోని సీఎం, సోషల్ మీడియాలో ఎవరు ఏం పోస్టులు పెడుతున్నారని ఆరా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
KTR Allegations | అండగా ఉంటాం
మన్నె క్రిశాంక్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు చెప్పినా.. అరెస్ట్ చేశారన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవేమీ పట్టించుకోని సీఎం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా (BRS Social Media) వారియర్లకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్కు 32 మంది సరెండర్!

