అక్షరటుడే, వెబ్డెస్క్: Miyapur Girl Death | నీటి సంపులో పడి మృతి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మియాపూర్ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
భద్రాది కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్, రేణుక దంపతులు బతుకు దెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. పలు ప్రాంతాల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో చరణ్ వారం క్రితమే శ్రీరెసిడెన్సీ అపార్ట్మెంట్లో పనికి చేరాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చరణ్ కుటుంబంతో కలిసి అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో వారి కుమార్తె సారా అపార్ట్మెంట్ ఆవరణలో మూత తీసి ఉన్న నీటి సంపులో పడిపోయింది.
Miyapur Girl Death | కనిపించకపోవడంతో..
సారా సంపులో పడి పోయిన విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. బాలిక కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి నీటి సంపులో చూశారు. అప్పటికే బాలిక అచేతనంగా కనిపించింది. వెంటనే నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Miyapur Girl Death | తల్లిదండ్రుల అనుమానం
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే బాలిక మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Street Dog Attack | హైదరాబాద్లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

