అక్షరటుడే వెబ్డెస్క్: Modi Japan PM | భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్లో జరిగిన విందు సందర్భంగా, భారతీయ శాస్త్రీయ వాద్యం ‘సంతూర్’పై జపాన్ ప్రధాని తనదైన శైలిలో వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాల మధ్య జరిగిన ఈ సాంస్కృతిక ఘట్టం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
Modi Japan PM | హైదరాబాద్ హౌస్లో ప్రత్యేక విందు..
భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం, ప్రధాని మోదీ జపాన్ ప్రధాని తకాయిచి కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధుల సమక్షంలో భారతీయ సాంప్రదాయ నృత్య, సంగీత ప్రదర్శనలు జరిగాయి. ఆ కార్యక్రమం మొత్తం భారతీయ కళా వైభవాన్ని చాటిచెప్పేలా ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.

Modi Japan PM | ప్రధాని మోదీ ప్రత్యేకాసక్తి..
ప్రదర్శనలో భాగంగా వినిపించిన భారతీయ శాస్త్రీయ వాయిద్యం ‘సంతూర్’ అందరినీ ఆకట్టుకుంది. ప్రదర్శన ముగిసిన తర్వాత, ప్రధాని మోదీ జపాన్ ప్రధానిని వేదికపైకి ఆహ్వానించి, స్వయంగా ఆ వాయిద్యాన్ని వాయించి చూడాలని కోరారు. మొదట కొత్త వాయిద్యం కావడంతో జపాన్ ప్రధాని సంకోచించారు. అయితే, మోదీ స్వయంగా ఆ వాయిద్యం ఎలా వాయించాలో స్టిక్స్తో చేసి చూపించి, ఆమెకు ఉత్సాహాన్ని అందించారు.
Modi Japan PM | లయబద్ధంగా వాయించి ..
ప్రధాని మోదీ వివరించిన విధానాన్ని చూసి ఉత్సాహం పొందిన సనాయె తకాయిచి, వెంటనే స్టిక్స్ అందుకుని ఎంతో లయబద్ధంగా సంతూర్ వాయించారు. విదేశీ ప్రధాని భారతీయ వాయిద్యాన్ని నేర్చుకుని అంత చక్కగా వాయించడాన్ని చూసి, మోదీతో పాటు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు చప్పట్లతో ఆమెను అభినందించారు. ఈ ఆత్మీయ దృశ్యం ఇరు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలిచింది.
*VIRAL: ప్రధాని మోదీ స్పెషల్ రిక్వెస్ట్..*
*‘సంతూర్’ వాయించిన జపాన్ పీఎం*
*చప్పట్లో మార్మోగిన హైదరాబాద్ హౌస్*https://t.co/QY9h9cvvPX pic.twitter.com/CsKF2Yrn22
— $h!v@ (@Shivakumar50) July 3, 2026
ఇది కూడా చదవండి: Secunderabad Boy Kidnapping | సికింద్రాబాద్ బాలుడి కిడ్నాప్ కేసు.. డాడీ అని పిలవడంతో ఎత్తుకెళ్లిన నిందితుడు