MSR Foundation Scholarships | ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉన్నతస్థాయికి ఎదగాలి: సీపీ సాయిచైతన్య

ఎంఎస్ఆర్​ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థికసాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: MSR Foundation Scholarships |ఎంఎస్ఆర్​ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థికసాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలోని అమ్మ వెంచర్​లో ఓ ఫంక్షన్ హాల్​లో ఎంఎస్​ఆర్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

MSR Foundation Scholarships | రూ.13లక్షల స్కాలర్​షిప్​లు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మొత్తం 30 మంది ఉత్తమ విద్యార్థులకు రూ.13లక్షల మేరకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారి తమ ఉజ్వల జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ హితవు పలికారు. క్రమశిక్షణతో కూడిన జీవితాలను విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకుని తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ఫౌండర్ శివారెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామన్నారు. స్కాలర్‌షిప్ తీసుకున్న విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో ఫౌండర్ శిరీషతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: A little more of Rudhra’s world… #Varanasi

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *