అక్షరటుడే, వెబ్డెస్క్ : Nagendra Resignation | కర్ణాటక (Karnataka) మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వాల్మికీ కార్పొరేషన్లో నాగేంద్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలని బీజీపీ నాయకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పదవిని వీడారు. రాజీనామాను ప్రకటించేటప్పుడు ఆయన భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆగస్టు మొదటి వారంలో నాగేంద్ర తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు.
Nagendra Resignation | రూ.89 కోట్ల అక్రమాలు
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల మేర అక్రమాలు జరిగాయని బీజేపీ (BJP) కొంతకాలంగా ఆరోపిస్తోంది. 2024 మే నెలలో ఆ సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ పి. ఆత్మహత్య చేసుకోవడం, ఆ సమయంలో నిధుల అనధికార బదిలీ గురించి ప్రస్తావిస్తూ రాసిన లేఖ బయటపడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన విచారణలో, సంస్థ బ్యాంక్ ఖాతాల నుండి భారీ మొత్తంలో నిధులు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలింది.
Nagendra Resignation | రెండోసారి రాజీనామా
డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి కాకముందు సిద్ధరామయ్య మంత్రివర్గంలో నాగేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు కుంభకోణం వెలుగులోకి రావడంతో 2024 జూన్లో రాజీనామా చేశారు. అనంతరం డీకే శివకుమార్ సీఎం అయ్యాక ఆయన తిరిగి మంత్రిగా ఎంపికయ్యారు. శివకుమార్కు ఆయన సన్నిహితుడిగా పేరుంది. తాను స్వయంగా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు.
Karnataka Minister B Nagendra has resigned from the Cabinet, breaking down in tears while announcing his decision at a press conference in Bengaluru
Nagendra, who was re-inducted into the Cabinet earlier this month, has been facing renewed pressure over the alleged… pic.twitter.com/AzgH02czOJ
— Nabila Jamal (@nabilajamal_) August 28, 2026
దీనిని కూడా చదవండి : CBI Bribery Case | రూ.40 లక్షల లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన జీఎస్టీ అధికారులు