NCP MPs BJP | బీజేపీకి బిగ్ బూస్ట్?.. 17 మంది NCP ఎంపీలు కాషాయ గూటికి.. లోక్‌సభలో 257కి బలం!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన 17 మంది లోక్‌సభ ఎంపీలు త్వరలో బీజేపీలో చేరనున్నారని రెబల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ బసునియా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: NCP MPs BJP | జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేచినట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన 17 మంది లోక్‌సభ ఎంపీలు త్వరలో బీజేపీలో చేరనున్నారని రెబల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ బసునియా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చేరికలు నిజమైతే లోక్‌సభలో బీజేపీ బలం 257కు చేరే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

అయితే NCPలోని ముస్లిం ఎంపీల విషయంలో మాత్రం భిన్నమైన పరిణామం చోటుచేసుకోనున్నట్లు బసునియా వెల్లడించారు. ముగ్గురు ముస్లిం ఎంపీలు మాత్రం NCPలోనే కొనసాగుతారని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పార్టీ మార్పులపై మరోసారి జాతీయ స్థాయిలో రాజకీయ చర్చ మొదలైంది.

NCP MPs BJP | NCPలో చీలికకు సంకేతమా?

17 మంది ఎంపీలు ఒకేసారి బీజేపీ వైపు అడుగులు వేస్తే.. అది సాధారణ రాజకీయ వలసగా కాకుండా NCPలో భారీ స్థాయి పునర్వ్యవస్థీకరణకు సంకేతంగా భావించే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాల్లో విభజనలు, పొత్తులు, ప్రత్యర్థి శిబిరాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ప్రకటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

NCP MPs BJP | 257కి బీజేపీ బలం?

బీజేపీలో 17 మంది ఎంపీలు చేరితే లోక్‌సభలో ఆ పార్టీ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 257 మంది ఎంపీలకు బీజేపీ బలం చేరుతుందన్న ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కేవలం సంఖ్యాబలం పెరగడమే కాకుండా.. కీలక బిల్లుల ఆమోదం, ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కోవడం, మిత్రపక్షాలతో బేరసారాల్లో బీజేపీకి మరింత రాజకీయ ఆధిక్యాన్ని కల్పించే అంశంగా మారవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

NCP MPs BJP | ముస్లిం ఎంపీల నిర్ణయంపై ఆసక్తి

ఇక ముగ్గురు ముస్లిం ఎంపీలు NCPలోనే కొనసాగుతారన్న ప్రకటనకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఒకవైపు పెద్ద సంఖ్యలో ఎంపీలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం సాగుతుండగా.. మరోవైపు ముస్లిం ఎంపీలు పార్టీతోనే కొనసాగడం NCP భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఆసక్తిని పెంచుతోంది.

Ganesh Immersion | నిమజ్జన ఊరేగింపుపై పోలీసుల వివాదాస్పద ఆదేశాలు!

మొత్తంగా చూస్తే, 17 మంది NCP ఎంపీల బీజేపీ చేరిక నిజమైతే జాతీయ రాజకీయ సమీకరణాల్లో మరో కీలక మలుపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రకటన ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుంది? ఎవరెవరు బీజేపీ కండువా కప్పుకోనున్నారు? NCP దీనిపై ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *