జాతీయంNEET Paper Leak | రూ.30 లక్షలకు నీట్​ పేపర్​ కొనుగోలు

NEET Paper Leak | రూ.30 లక్షలకు నీట్​ పేపర్​ కొనుగోలు

నీట్​ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు ఒక వారం ముందే కొనుగోలు చేసినట్లు సమాచారం.

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన ఇద్దరు సోదరులు, NEET-UG 2026 ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు ఒక వారం ముందే గురుగ్రామ్‌కు చెందిన ఒక వైద్యుడి నుంచి రూ. 30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు, పరీక్షకు వారం రోజుల ముందు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఒక వైద్యుడి నుండి ఈ ఏడాది నీట్-యూజీ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సోదరులలో ఒకరు ఆ పేపర్‌ను సికార్‌లో వైద్య ప్రవేశ పరీక్ష (Medical Entrance Exam)కు సిద్ధమవుతున్న తన కుమారుడికి ఇచ్చిన తర్వాత, వారు ఏప్రిల్ 29న దానిని పలువురికి విక్రయించినట్లు తెలిసింది.

NEET Paper Leak | కౌన్సెలింగ్ ఏజెంట్​కు

ఆ పేపర్‌ను సికార్‌లోని రాకేష్ కుమార్ మందవారియా అనే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ (MBBS Counseling) ఏజెంట్‌కు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను దానిని ఇతరులకు అమ్మినట్లు సమాచారం. నగరంలోని ప్రధాన కోచింగ్ సంస్థల వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాకేష్, ఆ తర్వాత ఆ పేపర్‌ను తన సహాయకులలో ఒకరికి రూ. 30,000కు అమ్మాడు. ఆ సహాయకుడు కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికార్‌కు చెందిన ఒక విద్యార్థి. పరీక్షకు ఒక రోజు ముందు ఆ విద్యార్థి ఆ పేపర్‌ను సికార్‌లోని పీజీ ఆపరేటర్ అయిన తన తండ్రికి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. “నాన్నా సికార్‌కు చెందిన ఒక స్నేహితుడు ఇది నాకు పంపాడు. దయచేసి మీ హాస్టల్‌లోని అమ్మాయిలకు ఇది ఇవ్వండి. రేపటి పరీక్షలో ఇదే వస్తుంది,” అని ఆ సందేశంలో ఉంది.

NEET Paper Leak | ప్రింటింగ్​ ప్రెస్ నుంచి..

ఈ కేసులో గురుగ్రామ్‌ (Gurugram)కు చెందిన డాక్టర్ కీలకమైన వ్యక్తిగా వెలుగులోకి వస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు మాట్లాడుతూ.. ఈ లీక్ నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా వచ్చి, ఒక “చైన్ నెట్‌వర్క్” ద్వారా గురుగ్రామ్ డాక్టర్‌కు చేరి ఉండవచ్చని తెలిపారు. సోదరుల అరెస్టు తర్వాత జరిగిన ప్రాథమిక విచారణలో, ఈ ఏడాది పేపర్ లీక్ అవుతుందని వారికి దాదాపు నెల రోజుల ముందే తెలుసని వెల్లడైంది. సోదరులలో ఒకరైన దినేష్‌కు ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. వారి కుటుంబంలోని నలుగురు పిల్లలు గత సంవత్సరం నీట్ (NEET) ఉత్తీర్ణులయ్యారని సమాచారం.

NEET Paper Leak | త్వరలో పరీక్ష వివరాలు

ప్రశ్నపత్రం లీక్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ (యూజీ) 2026 పరీక్షను మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఎన్​టీఏ ప్రకటించింది. కొత్త పరీక్ష తేదిని వారం నుంచి పది రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. ఈ రద్దు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఇది కూడా చదవండి..: Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

iBomma Website | టాలీవుడ్​కు షాక్​.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iBomma Website | కొంతకాలంగా మూతబడిన ఐ...

UAE Indian Billionaires | యూఏఈ బిలియనీర్లలో మనోళ్ల అధికం.. 17 మందిలో 9 మంది భారతీయులే!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UAE Indian Billionaires | 2026లో యూఏఈలోని...

Telangana Irrigation Projects | నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి : కవిత

అక్షరటుడే వెబ్‌డెస్క్ :Telangana Irrigation Projects |తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా...