అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad DRO Geetha | జిల్లా రెవెన్యూ అధికారిణిగా గీత (DRO Geetha) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలు రెవెన్యూ అసోసియేషన్ల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
Nizamabad DRO Geetha | టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ సంఘాల ఆధ్వర్యంలో..
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఆర్వో గీతను ఆమె కార్యాలయంలో గురువారం టీజీటీఏ(TGTA), టీజీఆర్ఎస్ఏ(TGRSA) ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. నాయకులు శేఖర్, దేవి సింగ్, పృథ్వీ, కిషన్, అరుణ, ప్రశాంత్, నితిన్, అశోక్, అమృత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారిణి గీత హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ (TGSWREI)లో అడిషనల్ సెక్రెటరీగా పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా నిజామాబాద్కు వచ్చారు. ఆమె తహశీల్దార్ స్థాయి నుంచి డీఆర్వో స్థాయికి పదోన్నతులు పొందారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath POCSO Case | భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!


