Nizamabad Teacher Attack | టీచర్లపై దాడికి యత్నం.. కేసు నమోదు చేసిన పోలీసులు..

టీచర్లపై దాడికి యత్నించిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Teacher Attack | టీచర్లపై దాడికి యత్నించిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలోని రెండో టౌన్​ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

Nizamabad Teacher Attack | గర్ల్స్​ స్కూల్​లో..

రెండో టౌన్​ ఎస్​హెచ్​వో యాదగిరి గౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం.. నగరం (Nizamabad)లోని గర్ల్స్ స్కూల్​లో గురువారం ఉదయం పదో తరగతి విద్యార్థిని ఛాతిలో నొప్పి రావడంతో ఉపాధ్యాయులు వెంటనే స్పందించి 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలో టీచర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ విద్యార్థిని మేనమామ, మేనబావలు టీచర్లపై దుర్భాషలాడారు. వారి విధులకు ఆటకం కలిగించారు. చెప్పుతో కొడతామని టీచర్లకు బెదిరించడంతో వారు రెండో టౌన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు అమ్మాయి బంధువులు పాల్ ఫిలిప్, దాస్, ఎబినేజర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: CP Sai Chaitanya | సీపీ సాయిచైతన్యకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *