అక్షరటుడే, ఇందూరు: Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు నిజామాబాద్ ఆర్టీసీ (Nizamabad RTC) రీజియన్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నిజామాబాద్-హైదరాబాద్ – బెంగళూరు లహరి ఏసీ సీటర్ & స్లీపర్ సర్వీస్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Nizamabad to Bengaluru Bus | కొత్త బోర్డింగ్ పాయింట్లు
నిజామాబాద్–బెంగళూరు లహరీ బస్లో కొత్త బోర్డింగ్ పాయింట్లను తీసుకొచ్చినట్లు ఆర్ఎం ఎస్వీజీ కృష్ణమూర్తి తెలిపారు. బెంగళూరు ప్రయాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్లో లహరి ఏసీ సీటర్ అండ్ స్లీపర్ సర్వీస్కు మేడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ‘ఎక్స్’ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా లహరి సర్వీసును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
Nizamabad to Bengaluru Bus | బెంగళూరు నుంచి నిజామాబాద్ వచ్చేటప్పుడు..

అదేవిధంగా.. బెంగళూరు నుండి నిజామాబాద్కు వచ్చే (డౌన్) సర్వీస్ సమయంలో పిణ్య, యశ్వంత్పూర్, ఆనంద్ రావు నగర్, ప్యాలెస్ గుట్టహళ్లి, సీబీఐ – జంక్షన్, బెంగళూరు – విమానాశ్రయం ‘X’ రోడ్ కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం వెల్లడించారు. ప్రయాణికులకు మరింత నాణ్యమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన సేవలను అందించడం టీజీఎస్ఆర్టీసీ లక్ష్యమని తెలిపారు. ఈ కొత్త బోర్డింగ్ పాయింట్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని లహరి ఏసీ సీటర్ అండ్ స్లీపర్ సర్వీస్లను ఆదరించాలని కోరారు. రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్ సైట్ www.tgsrtcbus.in ద్వారా లేదా రిజర్వేషన్ కౌంటర్లో టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana University Courses | తెయూలో జాడలేని బీఫార్మసీ, బీపీఈడీ కోర్సులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..