Nizamabad Wall Collapse | నగరంలో విషాదం.. గోడ కూలి వ్యక్తి మృతి

పొట్టకూటి కోసం కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Wall Collapse | పొట్టకూటి కోసం కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో(Nizamabad) బుధవారం చోటు చేసుకుంది.

Nizamabad Wall Collapse | నాల్గో టౌన్​ పరిధిలో..

నగరంలోని నాల్గో టౌన్ పరిధిలోని వినాయక్​నగర్​లో ఓ ఇంటిపై ఉన్న గోడను కూల్చివేసేందుకు బోధన్​ నుంచి వచ్చిన అడ్డా కూలీ వెళ్లాడు. అయితే గోడను కూలగొట్టే క్రమంలో అకస్మాత్తుగా అది అతడిపై పడింది. దీంతో అక్కడికక్కడే సదరు కూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్​ ఎస్​హెచ్​వో సతీష్​ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: Kavitha Ricky Radhan Meeting | కవిత ఇంట్లో విజయ్ జ్యోతిష్యుడు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *