అక్షరటుడే, కామారెడ్డి: RTC staff attack police | ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు.
RTC staff attack police | సామాన్య ప్రజలను అడ్డుకుంటూ..
కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, మధు, శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది ఉన్నారని సీఐ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయటికి వెళ్లే దారిలో వాహనాలు, సామాన్య ప్రజల రాకపోకలను ఆర్టీసీ సిబ్బంది ఆటంకపర్చుతున్నారని చెప్పారు.
దీంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పగా.. పోలీసుల మీద దాడి చేశారని సీఐ వివరించారు. ఈ విషయమై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ కండక్టర్ పరమేశ్తో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
RTC staff attack police | కఠిన చర్యలు తప్పవు
ఎవరైనా దాడులకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ స్పష్టం చేశారు. పోలీసులపై దాడి విషయమై ఆర్టీసీ కండక్టర్ పరమేశ్ మీద చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రీజనల్ మేనేజర్కు నివేదిక పంపించినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

