అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Corruption | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
Kamareddy Municipal Corruption |రూ.1.70కోట్లు అవినీతి..
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ.. రూ.1.70 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.5,92,91,364 ఖర్చు కాగా, అందులో 75 బిల్లులకు సంబంధించి రూ.1,13,14,566 చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని వారన్నారు. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.71,28,937 ఖర్చు చేయగా, అందులో 5 బిల్లులకు రూ.5986,353 చెల్లింపుల్లో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంతమంది ప్రజా ప్రతినిధుల హస్తం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ మేరకు సరైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదుపై సరైన స్పందన రాకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు హెచ్చరించారు.