అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Oora Panduga | కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాల కుల సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ఊరపండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం మొక్కులు చెల్లించుకున్నారు.
Bheemgal Oora Panduga | ఏకతాటిపైకి పండుగ నిర్వహణ భేష్
ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ చిన్న-పెద్ద తేడా లేకుండా ఏకతాటిపైకి వచ్చి ఈ సామూహిక ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఇందులో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.భీమ్గల్ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fishermen Association | మత్స్యకార సంఘానికి కేంద్ర నిధులతో ఊతం