అక్షరటుడే, ఇందూరు: Paddy Transport Inspections | జిల్లావ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ(Civil Supplies Department) ఆధ్వర్యంలో యాసంగి సీజన్లో ధాన్యం సేకరణను వేగవంతం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సైతం సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీలను సమకూర్చుకుని త్వరితగతిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో లారీల తనిఖీలు చేపట్టారు.
Paddy Transport Inspections | డీటీసీ ఆధ్వర్యంలో తనిఖీలు..
మాధవనగర్(Madhava nagar) ఆర్వోబీ ప్రాంతంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల(DTC Durga Pramila) నేతృత్వంలో బుధవారం ఉదయం ఎంవీఐ కిరణ్, ఇతర అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఖాళీగా వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఖాళీగా ఉన్న లారీలు అధికారుల సూచనల మేరకు తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలందించాలని సూచించారు. లేని పరిస్థితిలో కలెక్టర్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని డీటీసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ సీజన్లో 86 లారీలను ప్యాడీ సెంటర్లకు తరలించినట్లు తెలియజేశారు.
Paddy Transport Inspections | జిల్లావ్యాప్తంగా ఆరు మొబైల్ టీంలు..
ఖాళీగా ఉన్న లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆరు మొబైల్ టీంలను సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని డీటీసీ తెలిపారు. అందులో రవాణా శాఖ అధికారులు సైతం ఉన్నారన్నారు. మాధవనగర్ వంతెన వద్ద, జగిత్యాల (Jagtial) వైపు వెళ్లే మార్గంలో, అంకాపూర్ వద్ద, బాల్కొండ జాతీయ రహదారిపై, నందిపేట్ సమీపంలో, మరో మొబైల్ టీం పనిచేస్తున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: Nagarjuna T Shirts | నాగార్జున ఫోటోలతో టీ-షర్టుల విక్రయం.. ఢిల్లీ హైకోర్టు సీరియస్!

