అక్షరటుడే, వెబ్డెస్క్ : Pellet Gun FIR | ఢిల్లీ (Delhi)లో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో పెల్లెట్ గన్ ఉపయోగించిన వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూలై 20న పార్లమెంట్ వద్ద జరిగిన నిరసనలో పెల్లెట్ గన్ (pellet-gun) గాయాలకు గురైన 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ విషయంలో రాహుల్ గాంధీ డీసీపీ ఆఫీసు () ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రాహుల్ గాంధీ బాధిత యువకుడితో కలిసి శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే, 30 రోజులు లేదా ఆరు నెలల పాటు పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేస్తానని పేర్కొన్నారు. ఆయన రోజంతా అక్కడ ధర్నా చేశారు. పోలీసులు సముదాయించిన వినలేదు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Pellet Gun FIR | ఏడు గంటల తర్వాత..
రాహుల్ గాంధీ (Pellet Gun FIR) మాట్లాడుతూ.. న్యాయం దిశగా ఇది మొదటి అడుగు అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ఎంత సమయం పట్టిందో చూడాలన్నారు. పెల్లెట్లు ప్రయోగించి నెల రోజులైందని, అతని శరీరంలో ఇంకా పెల్లెట్లు ఉన్నాయన్నారు. తాము ఉదయం 11:30 గంటలకు వచ్చామని, దాదాపు ఏడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని గాంధీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామంలో, చిన్న పట్టణంలో ఉండే పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని పేర్కొన్నారు.
साहिल की FIR दर्ज हुई। यह न्याय की तरफ़ पहला क़दम है।
पर सोचिए – एक FIR लिखने की इजाज़त तक गृह मंत्रालय से आनी पड़ी। अब समझ आया कि न्याय पर लगाम किसने लगा रखी है। pic.twitter.com/nvTwbEmplt
— Rahul Gandhi (@RahulGandhi) August 21, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన