అక్షరటుడే, వెబ్డెస్క్: Petrol Price Hike | వాహనదారులకు మింగుడుపడని వార్త ఇది. అంతర్జాతీయ పరిణామాలు భారతీయుల జేబులపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకడంతో, కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త ధరలు మే 15, 2026 (శుక్రవారం) నుంచే అమలులోకి వచ్చాయి.
Petrol Price Hike | ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు సగటున ₹3 మేర పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ధరలు అత్యధికంగా ఉండటం గమనార్హం.
హైదరాబాద్: ₹110.50 (పెరుగుదల: ₹3.39)
కోల్కతా: ₹108.74 (పెరుగుదల: ₹3.29)
ముంబయి: ₹106.68 (పెరుగుదల: ₹3.14)
చెన్నై: ₹103.67 (పెరుగుదల: ₹2.83)
ఢిల్లీ: ₹97.77 (పెరుగుదల: ₹3.00)
Petrol Price Hike | డీజిల్ ధరల పరిస్థితి ఏమిటి?
రవాణా రంగానికి వెన్నెముక లాంటి డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
హైదరాబాద్: ₹98.70 (పెరుగుదల: ₹3.26)
చెన్నై: ₹95.25 (పెరుగుదల: ₹2.86)
కోల్కతా: ₹95.13 (పెరుగుదల: ₹3.11)
ముంబయి: ₹93.14 (పెరుగుదల: ₹3.11)
ఢిల్లీ: ₹90.67 (పెరుగుదల: ₹3.00)
Petrol Price Hike | ఎందుకీ ధరల పెరుగుదల?
గత కొన్ని రోజులుగా ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింది. ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగడంతో బ్యారెల్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీని ప్రభావంతో దేశీయంగా చమురు కంపెనీలు ధరలను సవరించక తప్పలేదు.
హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹110 మార్కును దాటడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడికి, తాజా పెంపు ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా మారింది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


