PM Modi | కామన్​వెల్త్​ గేమ్స్​ విజేతలను అభినందించిన ప్రధాని

కామన్​వెల్త్​ గేమ్స్​ 2026లో భారత్​కు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభినందించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | కామన్​వెల్త్​ గేమ్స్​ 2026 (CWG 2026)లో భారత్​కు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభినందించారు. క్రీడాకారులు ఆదివారం ఆయనను ఢిల్లీలో కలిశారు.

గ్లాస్గో ఈవెంట్ విజేతలను ప్రధాని అభినందించి, వారి ప్రదర్శనలను ప్రశంసించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఒక వీడియోను ప్రధాని మోదీ ఎక్స్​లో పోస్టు చేశారు. భారతదేశానికి స్వర్ణ పతకం అందించిన బాక్సర్ సాక్షి చౌదరి (Sakshi Chowdary) సెల్ఫీ కెమెరా పట్టుకుని వీడియో తీశారు. ప్రధాని కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలందరినీ ఇక్కడికి ఆహ్వానించారన్నారు. మోదీ మాట్లాడుతూ.. జో ఖేలేగా.. వో ఖిలేగా అన్నారు.

PM Modi | 39 పతకాలు

కామన్​వెల్త్​ క్రీడల్లో భారత్​ 13 స్వర్ణాలు, 17 రజతాలు, తొమ్మిది కాంస్యాలతో సహా మొత్తం 39 పతకాలను సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 2022లో బర్మింగ్‌హామ్‌లో గెలుచుకున్న 61 పతకాలతో పోలిస్తే భారతదేశం సాధించిన పతకాల సంఖ్య తక్కువ. అయితే కొన్ని ఆటలను తొలగించారు. 2022లో భారత్ 30 పతకాలు సాధించిన ఈవెంట్లు ప్రస్తుతం జరిగిన గేమ్స్​లో లేవు. నాలుగు సంవత్సరాల క్రితం 210 మంది అథ్లెట్లతో పోలిస్తే, ఈసారి కేవలం 122 మందితోనే భారతదేశం తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. లాంగ్-డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ రెండు పతకాలు సాధించాడు.

దీనిని కూడా చదవండి : KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *