అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | కామన్వెల్త్ గేమ్స్ 2026 (CWG 2026)లో భారత్కు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభినందించారు. క్రీడాకారులు ఆదివారం ఆయనను ఢిల్లీలో కలిశారు.
గ్లాస్గో ఈవెంట్ విజేతలను ప్రధాని అభినందించి, వారి ప్రదర్శనలను ప్రశంసించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఒక వీడియోను ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. భారతదేశానికి స్వర్ణ పతకం అందించిన బాక్సర్ సాక్షి చౌదరి (Sakshi Chowdary) సెల్ఫీ కెమెరా పట్టుకుని వీడియో తీశారు. ప్రధాని కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలందరినీ ఇక్కడికి ఆహ్వానించారన్నారు. మోదీ మాట్లాడుతూ.. జో ఖేలేగా.. వో ఖిలేగా అన్నారు.
PM Modi | 39 పతకాలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, తొమ్మిది కాంస్యాలతో సహా మొత్తం 39 పతకాలను సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 2022లో బర్మింగ్హామ్లో గెలుచుకున్న 61 పతకాలతో పోలిస్తే భారతదేశం సాధించిన పతకాల సంఖ్య తక్కువ. అయితే కొన్ని ఆటలను తొలగించారు. 2022లో భారత్ 30 పతకాలు సాధించిన ఈవెంట్లు ప్రస్తుతం జరిగిన గేమ్స్లో లేవు. నాలుగు సంవత్సరాల క్రితం 210 మంది అథ్లెట్లతో పోలిస్తే, ఈసారి కేవలం 122 మందితోనే భారతదేశం తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. లాంగ్-డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ రెండు పతకాలు సాధించాడు.
Always #Cheer4Bharat. pic.twitter.com/eSjh8o1Ris
— Narendra Modi (@narendramodi) August 9, 2026
దీనిని కూడా చదవండి : KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్