అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR Consoles | దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి (Peddi Sudarshan Reddy) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి బయలు దేరారు. ఈ సమయంలో దారిపొడుగున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నల్లబెల్లి చేరుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి (KCR Consoles ), ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు ఆయనను చూడటానికి అక్కడకు తరలి వచ్చారు.
KCR Consoles | చెక్కులు అందజేత
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్ను అందించారు. అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయలు చెక్కులు అందజేసిన కేసీఆర్.… pic.twitter.com/yAzBVgSjwm
— BRS Party (@BRSparty) August 9, 2026
దీనిని కూడా చదవండి : Medico Priyanka Death | చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక మృతి