అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajnath Singh Warning | రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్ (Pakistan)కు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దుస్సాహసానికి, ఊహించని ప్రతిస్పందన తప్పదన్నారు. లడఖ్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పాక్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ సైన్యానికీ, మిలిటెంట్లకీ మధ్య ఎలాంటి తేడా లేదని విమర్శించారు. భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తే, పాకిస్థాన్ తీవ్రవాద కేంద్రాలను సృష్టిస్తోందని ఆరోపించారు. తాము స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటే.. వారు ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ సెమీకండక్టర్లను తయారు చేస్తుంటే, వారు ఆత్మాహుతి బాంబులను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.
Rajnath Singh Warning | చర్చలు ఉండవు
పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు జరిగితే పీవోకే (POK)పై మాత్రం జరుగుతాయన్నారు. అధి భారత్లో భాగమని స్పష్టం చేశారు. భారత్ ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధిపై దృష్టి సారిస్తుండగా, పాకిస్థాన్ చొరబాటు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. ఏ సవాల్నైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 1999 యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించిన సింగ్, వారి త్యాగాన్ని దేశం స్మరించుకుంటున్నప్పటికీ, ప్రాక్సీ యుద్ధం (పరోక్ష యుద్ధం), సరిహద్దు చొరబాట్ల వంటి నిరంతర ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
పాకిస్తాన్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫైర్
పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అక్కడ సైన్యానికీ, మిలిటెంట్లకీ మధ్య ఎలాంటి తేడా లేదు. భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తే, పాకిస్థాన్ తీవ్రవాద… pic.twitter.com/nuXPUz9r3Z
— Akshara Today | Telugu News (@aksharatoday) July 26, 2026
దీనిని కూడా చదవండి : Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత