Ration Rice Seizure | ఎల్లారెడ్డిలో రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Shashi kiran Mottala

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Ration Rice Seizure | రేషన్ బియ్యంను (ration rice) అక్రమంగా రవాణా (illegal transport) చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి(Yellareddy) ఎస్సై మహేష్ వివరాలు వెల్లడించారు.

Ration Rice Seizure | వాహనాలు తనిఖీ చేస్తుండగా..

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా శివనగర్ ప్రాంతంలో రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న శ్రీనివాస్, అతనితో పాటు ఉన్న చరణ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పారిపోయినట్లు తెలిపారు. సదరు ఇద్దరు వ్యక్తులు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా బొమ్మల రామారావు కేకే తండా చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారి వద్ద నుంచి 44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Singer Mangli | మైక్రోఫైనాన్స్ కేసులో కీలక మలుపు.. మంగ్లీ సోదరుడి అకౌంట్​లోకి డబ్బులు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *