అక్షరటుడే, వెబ్డెస్క్ : Sanathnagar TIMS | దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్ను అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. శుక్రవారం ఆయన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్నగర్ టిమ్స్ను సందర్శించారు.
సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. జూన్లో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం అందులో ట్రయల్ రన్ కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ ఆస్పత్రిని సందర్శించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. బసవతారకం ఆస్పత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ కట్టించారని చెప్పారు.
Sanathnagar TIMS | రూ.1200 కోట్లతో..
అన్ని రకాల సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ రూ.1200 కోట్లతో ప్రారంభించారని కేటీఆర్ చెప్పారు. ఆసుపత్రే కాకుండా.. పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకడమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ (KCR) ఏర్పాటు చేశారని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆలోచనతో జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించారని గుర్తు చేశారు. కాగా టిమ్స్లో 1000 పడకలు ఉంటాయి.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Son Posters | ‘పోస్టర్’ రోగం.. తెలంగాణలో కొత్త రాజకీయం!


