అక్షరటుడే, వెబ్డెస్క్: Shivdhar Reddy | మరికొద్ది గంటల్లో పదవీ విరమణ పొందనున్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వయిజర్ (ఎస్ఎస్ఏ) ఛీఫ్ సెక్రెటరీ హోదాలో నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి రేపు (ఏప్రిల్ 30న) రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో ప్రభుత్వం సీవీ ఆనంద్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీగా కీలకంగా వ్యవహరించిన శివధర్ రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కాగా.. 2025 అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల అమలులో పక్కాగా వ్యవహరిస్తున్నారు.
Shivdhar Reddy | నక్సల్స్ లొంగుబాటులో కీలకం
డీజీపీ శివధర్ రెడ్డి నక్సల్స్ లొంగుబాటులోనూ కీలకంగా వ్యవహరించారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించారు. మావోయిస్టులు ఉద్యమ పంథాను వీడి జనంలోకి వచ్చేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఆయన హయాంలో పెద్ద ఎత్తున నక్సల్స్ లొంగిపోయారు. ఇలా శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలకంగా పనిచేయడంతో ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వయిజర్ (ఎస్ఎస్ఏ) పోస్టును ఏర్పాటు చేసి ఆయనను నియమించింది. ఎస్ఎస్ఏకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడించనుంది.
ఇది కూడా చదవండి..: DSP Promotions | 35 మందికి ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

