అక్షరటుడే, వెబ్డెస్క్: Social Media Misuse | ఎన్నికల వేళ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఐటీ నియమాలు 2021, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.
Social Media Misuse | మూడు గంటల్లో చర్య
సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో తప్పుదారి పట్టించే పోస్టులు చేసినట్లయితే చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏఐ ద్వారా తప్పుదారి పట్టించే కంటెంట్ రూపొందించినా మూడు గంటల్లోపు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Social Media Misuse | ఎన్నికల్లో నిరంతర నిఘా
అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంటుందని ఈసీ పేర్కొంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినా.. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు చేసినా.. పోలింగ్ ప్రక్రియ, యంత్రాంగంపై తప్పుడు కథనాలు ప్రచురించినా తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Social Media Misuse | 11 వేలకు పైగా పోస్టులపై చర్య
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోస్టులపై నిఘా పెట్టామని తెలిపింది. ఇప్పటి వరకు 11,000కి పైగా సోషల్ మీడియా పోస్టులు/లింకులు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కంటెంట్ తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్లు సైతం నమోదు చేసినట్లు చెప్పింది.
C-Vigil యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు..
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పౌరులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఫిర్యాదు చేయవచ్చని ఈసీ పేర్కొంది. C-Vigil మాడ్యూల్ ద్వారా సులభంగా తమ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. కాగా.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 19 వరకు C-Vigil యాప్ ద్వారా 3,23,099 ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పింది. వీటిలో 3,10,393 ఫిర్యాదులు అంటే 96.01 శాతం నిర్దేశించిన 100 నిమిషాలలోపు విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి..: Modi on Women Reservation | మహిళల కలలను ధ్వంసం చేశారు.. విపక్షాలపై ప్రధాని ఫైర్

