అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, అకడమిక్ క్యాలెండర్, పంటల మార్పిడి విధానం, ఫీజుల నియంత్రణతో పాటు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు వంటి పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల పనితీరు వంటి అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది.
Telangana Cabinet Meeting | జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలపై..
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల వ్యవహారంలో మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న గుడ్న్యూస్ చెబుతామని సీఎం తెలిపారు. దీనిపై కేబినెట్లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్హులైన విలేకరులకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇళ్ల స్థలాల కోసం 18 ఏళ్లుగా జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీతో పాటు ఇతర సొసైటీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులు, ఇతర అంశాలతో ఇళ్ల స్థలాల వ్యవహారం ముందుకు సాగలేదు. తాజాగా దానిపై మంత్రివర్గంలో చర్చించనుండటంతో జర్నలిస్ట్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Street Dog Attack | హైదరాబాద్లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

