Telangana IPS Transfers | పలువురు ఐపీఎస్​ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్​లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్​లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్ సీపీగా శ్వేత రెడ్డి (Swethe Reddy) నియమితులయ్యారు. సీఐ సెల్ ఎస్పీగా సింధు శర్మ, సీఐడీ ఎస్పీలుగా రూపేష్, ప్రవీణ్ కుమార్, రైల్వే ఎస్పీగా సాయి శేఖర్​కు ప్రభుత్వం పోస్టింగ్​ ఇచ్చింది. నార్త్ రేంజ్ జాయింట్ సీపీగా విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా సన్ ప్రీత్ సింగ్​గా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్​గా చంద్ర మోహన్ ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

Telangana IPS Transfers | హైడ్రా అడిషనల్​ కమిషనర్​గా..

గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్ధిఖీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా పుష్ప, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, హైడ్రా అడిషనల్ కమిషనర్​గా ఆనంద్ కుమార్​కు పోస్టింగ్​ ఇచ్చింది.

Telangana IPS Transfers | అదనపు బాధ్యతలు

ips

మల్టీ జోన్ – 1 ఐజీగా రామగుండం సీపీ అంబర్‌ కిషోర్ ఝాకు, యాదాద్రి జోన్ డీఐజీగా జోయల్ డేవిస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజన్న జోన్ డీఐజీగా సన్‌ప్రీత్ సింగ్​కు, భద్రాద్రి జోన్ డీఐజీగా ఎన్.శ్వేతకు బాసర జోన్ డీఐజీగా ఆర్.భాస్కరన్‌కు, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీగా ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

దీనిని కూడా చదవండి : Saikrishna Lockup Death | సాయికృష్ణ లాకప్​ డెత్​.. లొంగిపోయిన హెడ్​ కానిస్టేబుళ్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *