అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala Temple | గోవిందా.. గోవిందా.. నామస్మరణలతో బీర్కూర్ (Birkur) మండలం తిమ్మాపూర్ శివారులోని (Thimmapur Temple) తెలంగాణ తిరుమల దేవస్థానం మారుమోగింది. శ్రావణ మాసం శనివారం కావడంతో ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు.
Telangana Tirumala Temple | భక్తజన సంద్రంగా ఆలయం..
దీంతో శ్రీవారి కొండ భక్తజన సంద్రంగా మారింది. ఈ సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. శ్రావణ మాసం శనివారం శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి కొండ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
అలాగే కొండ దిగువ నుంచి ఆలయం వరకు దేవస్థానానికి చెందిన వాహనాల ద్వారా భక్తులను తరలించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అప్పారావు, బీర్కూర్ తండా సర్పంచ్ దేవిసింగ్, నరసరాజు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ChatGPT for Teens | ఓపెన్ఏఐ కీలక నిర్ణయం. టీనేజర్ల కోసం అద్భుత ఫీచర్!