అక్షరటుడే, నెట్వర్క్: Adilabad Boy Death | చింతగింజలు తింటుండగా.. ప్రమాదవశాత్తు అవి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Adilabad Boy Death | ఊపిరాడక..విలవిల్లాడి..
ఆదిలాబాద్ (Adilabad)కు చెందిన మంకేష్ (9)కు చింతగింజలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. శనివారం చింతగింజలు తింటుండగా ఒక్కసారిగా అవి గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడికి ఊపిరి ఆడలేదు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ బాలుడు మృతి చెందినట్లు సమాచారం. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు ఆహారం లేదా గింజలు తినే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Jupalli Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం : మంత్రి జూపల్లి కృష్ణారావు