అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TGSRTC OPRS Services | ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్ రీజియన్(nizamabad rtc) నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని రీజినల్ మేనేజర్ టీ జోత్స్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
TGSRTC OPRS Services | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని..
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుండి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తూ.. ఓపీఆర్ఎస్ (ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం)ను (OPRS) అమలు చేస్తున్నట్లు ఆర్ఎం తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, ఎయిర్పోర్ట్, తిరుపతి, విజయవాడ, భద్రాచలం తదితర ప్రాంతాలకు మొత్తం 82 ఓపీఆర్ఎస్ ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రయాణికుల అవసరాలను బట్టి రాజధాని, సూపర్ లగ్జరీ, ఈ సూపర్ లగ్జరీ(E Super Luxury), లహరి ఏసీ, లహరి(Lahari) నాన్-ఏసీ వంటి బస్సు సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, జేబీఎస్, ఎంజీబీఎస్కు అధిక సంఖ్యలో సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ వెబ్సైట్ (www.tgsrtcbus.in), MEE TICKET అనే మొబైల్ యాప్లో టికెట్ బుక్ చేసుకోవచ్చని సూచించారు.
ఇది కూడా చదవండి: Bajaj Group Centenary | బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాలు.. దేశాభివృద్ధిలో వందేళ్ల నమ్మకమైన ప్రస్థానం

