Three Months Ration | ఒకేసారి మూడు నెలల రేషన్​ బియ్యం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలల రేషన్​ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Three Months Ration | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలల రేషన్​ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింది. ఎల్​నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు, సెప్టెంబర్​, అక్టోబర్​ నెలలకు సంబంధించిన రేషన్​ బియ్యాన్ని ఒకేసారి అందించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పంపిణీ చేపట్టాలని సూచించింది. దీంతో రాష్ట్ర పౌర సరఫరా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెలా రేషన్​ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేది నుంచి 15 వరకు డీలర్లు బియ్యం అందిస్తారు. అయితే ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో నెల రోజుల పాటు పంపిణీ చేయాలని ప్రభుత్వం డీలర్లను ఆదేశించింది. బియ్యం కోసం మూడు సార్లు బయోమెట్రిక్​ వేయాల్సి ఉంటుంది. గతంలో సైతం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్​నూ ఒకే నెలలో పంపిణీ చేశారు.

Three Months Ration | ఈ కేవైసీ చేయించాలి

రేషన్​ కార్డు (Ration Card) లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కేవైసీ నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్‌ సరఫరా అయ్యేలా జాతీయ సమాచార వ్యవస్థ (ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ అప్​డేట్ చేస్తుంది. తెలంగాణలో కొత్తగా రేషన్​ కార్డులో పేరు ఎక్కిన వారు చాలా మంది ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈ నెల 31 వరకు ఈ కేవైసీ చేయించుకోవడానికి గడువు ఉంది. ఇప్పటి వరకే చేయించుకోని వారు సమీపంలోని రేషన్​ దుకాణానికి వెళ్లి ఉచితంగా కేవైసీ చేయించుకోవచ్చు.

 దీనిని కూడా చదవండి : PV Sindhu Japan Open | పీవీ సింధు సంచలనం.. జపాన్​ ఓపెన్​ టైటిల్​ కైవసం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *